EPAPER

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.


డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్​ ప్యానెల్​ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.

గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్ సమావేశమవ్వగా.. మహువాను లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని చేసిన సిఫార్సును ప్యానెల్ కు ఆమోదించింది. దానిని లోక్ సభ స్పీకర్ కు సమర్పించింది. నివేదికలో పార్లమెంట్ మెంబర్ గా మహువా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, అనైతికమైనవని, హేయమైనవని, నేరపూరితమైనవని ఎథిక్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.


తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×