పాముకాటుతో ఓ వృద్ధుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో చోటు చేసుకుంది. ఇలపర్రు గ్రామానికి చెందిన గుల్లపూడి వెంకటేశ్వరరావుకి పాము కరిచింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108 సర్వీస్కి కాల్ చేయగా స్పందించలేదు. అప్పటికే గంట సమయం గడిచిపోయింది. కుటుంబ సభ్యులే హుటాహుటిన ఆటోలో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుడివాడ వచ్చే వరకు మెలకువగా కళ్లు తెరిచి ఉన్న వేంకటేశ్వరరావు హాస్పిటల్ లోకి వచ్చేసరికి స్పృహ కోల్పొయాడు.
అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును డ్యూటీ డాక్టర్ తేజస్వి, సిబ్బంది వాక్సిన్స్ ఇచ్చినప్పటికీ పల్స్ పడిపోయింది. ప్రాణం పోయేటట్లు ఉన్న వృద్దుడికి 15 నిమిషాలు CPR చేస్తూ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే వెంకటేశ్వరరావు శరీరం పూర్తిగా విషాపూరితం కావడంతో ఎంత ప్రయత్నించినా ప్రాణాన్ని కాపాడలేకపోయారు.