తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ సమీపంలోని ఫామ్హౌస్లో తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు.
బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయనకు గాయాలు అయ్యాయి. బాత్రూమ్లో జారి పడిపోవడం వల్ల ఆయన ఎడమ కాలి తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స నిర్వమించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై మోడీ ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఆయన ప్రమాదానికి గురికావడం చాలా బాధకరమని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
.
.