తెలంగాణలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎల్బీస్టేడియం వేదికగా సీఎంగా రేవంత్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్తోపాటు 9 నుంచి 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. వీరిలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ లేదా ఆయన సతీమణి పద్మావతిరెడ్డి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రేమ్సాగర్రావు, సీతక్క, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
వీరితోపాటు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పి.సుదర్శన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రమాణం చేసే అవకాశముందన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎంగా భట్టిని నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఈ పదవికి ఎవరికి ఇచ్చే అవకాశాలు లేవన్న చర్చ నడుస్తోంది. కాగా సీనియర్ నేతలైన కొందరికి కేటాయించే శాఖలపై కొంత స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇందులో శ్రీధర్బాబుకు ఆర్థికశాఖ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ పదవిని ఆయన తిరస్కరించడంతో ఆర్థిక శాఖ కేటాయించినట్టు సమాచారం. అలాగే భట్టి విక్రమార్కకు రెవెన్యూశాఖ ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్. భట్టినే డిప్యూటీ సీఎం గా నియమించి రెవెన్యూ లేదా మరేశాఖ అయినా కేటాయించే అవకాశముంది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. 17 మంది మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు..?, రేవంత్తోపాటు ప్రమాణం చేసే మంత్రలెవరన్నది ఆసక్తిగా మారింది.