Office Furniture Robbery | అధికారం ఉన్నంతవరకూ ఒకలా… తర్వాత మరొకలా ఉండటం చాలామంది నేతలకు పరిపాటిగా మారింది. తమ హయంలో ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన వస్తువులు, ఫర్నీచర్.. తర్వాత వచ్చే వారికి గౌరవంగా అందించాల్సిన నేతలు.. అలా చేయకుండా వాటిని సొంతం చేసుకునేందుకు యత్నించారు. ప్రజాధనాన్ని ఇలా తస్కరించాలనుకోవటం సరికాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Office Furniture Robbery | అధికారం ఉన్నంతవరకూ ఒకలా… తర్వాత మరొకలా ఉండటం చాలామంది నేతలకు పరిపాటిగా మారింది. తమ హయంలో ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన వస్తువులు, ఫర్నీచర్.. తర్వాత వచ్చే వారికి గౌరవంగా అందించాల్సిన నేతలు.. అలా చేయకుండా వాటిని సొంతం చేసుకునేందుకు యత్నించారు. ప్రజాధనాన్ని ఇలా తస్కరించాలనుకోవటం సరికాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ ఓయూ విద్యార్థులు ఆందోళన
మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు.రవీంద్రభారతి లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ను… ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు పట్టుకున్నారు. ప్రభుత్వ వస్తువులను… శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు. దీనిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఓయూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి ఘటనే.. నిజామాబాద్ జిల్లాలోనూ జరిగింది. బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలిస్తున్న BRS నేతలను… కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఫర్నీచర్ తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దే తీవ్ర వాగ్వాదం నెలకొంది. రెండు డీసీఎం వాహనంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటీకి సామగ్రి తరలించారు. కాంగ్రెస్ నేతల అడ్డగింతతో ఫర్నీచర్ను.. బిఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించేందుకు యత్నించగా.. వినకపోవటంతో లాఠీఛార్జ్ చేశారు.