మిగ్ జాం తుపాను ప్రభావానికి దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డ , కోడూరు, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతోపాటు ఈదురు గాలులకు వరి పంటలు నేలకు ఒరిగి జలమయమయ్యాయి.
చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తుపాను ప్రభావంతో పూర్తిగా నీటి ముంపునకు గురైన పంట పొలాలను అధికారులు పరిశీలించాలని రైతులు కోరారు. ఎకరాకు 40 వేల రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలిని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.