మిగ్ జాం తుపాను దాటికి రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారు. ఒకపక్క తుపాను మరోపక్క వైరస్ విజృంభించి అన్నదాత నడ్డి విరుస్తున్నాయి. గంగవరం మండలం కల్లుపల్లి గ్రామంలో సతీష్ అనే రైతుకు చెందిన సుమారు 12 ఎకరాల టమోటా పంట తుపాను, వైరస్ దాటికి దెబ్బతింది. మొక్కలు కుళ్లిపోతున్నాయని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కోత దశలో ఉన్న వరి పంట చేతికి అందుతుందని ఆశలు అడియాసలయ్యాయని తీవ్ర ఆందోళన చెందారు. ఎకరాకి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టానని ఆ రైతు తెలిపారు. 12 ఎకరాలకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టానన్నారు. ఇప్పుడు మూడు లక్షల కూడా వచ్చేటట్టుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.