EPAPER

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?
Madhya Pradesh news today

Madhya Pradesh news today(Current news from India):

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్‌గఢ్‌లోని పిప్లియా రసోడా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు బాలిక బోరుబావిలో పడిందని గుర్తించారు.


తల్లిదండ్రుల ఫిర్యాదుతో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. రాజ్ గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్ గఢ్ ఎస్పీ ధరమ్ రాజ్ మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక సుమారు 30 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ, ఇతర పరికరాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వెళ్లగా.. 22 అడుగుల వద్ద చిన్నారి ఏడుపును గుర్తించారు. పాప బ్రతికే ఉందని గ్రహించి.. వెంటనే ఆక్సిజన్ ను లోపలికి పంపారు. సుమారు 9 గంటల పాటు శ్రమించి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బాలికను బయటకు తీశారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Related News

Ratapani Wildlife Sanctuary: 7 పులులు, 14 చిరుత పులులు, 1 ఎలుగుబంటి మృతి.. ‘అంతా రైల్వే శాఖ తప్పిదమే’

Prakash Ambedkar: షరద్ పవార్ సిఎంగా ఉన్నప్పుడే మాఫియా డాన్‌తో దుబాయ్‌లో కలిశేవారు: అంబేడ్కర్ మనవడు

RSS Workers Injured: మిడ్‌నైట్ హంగామా.. 10 మందిపై కత్తులతో దాడి.. రాత్రి ఏం జరిగిందంటే..

Eknath Shinde son: నిషేధం ఉన్నా గర్భగుడిలో ప్రవేశించిన సిఎం కుమారుడు.. మండిపడిన ప్రతిపక్షాలు

Tamil Nadu Governor: ‘జాతీయ సమైక్యతను అవమానించారు.. గవర్నర్‌ను రీకాల్ చేయండి’.. కేంద్రాన్ని కోరిన సిఎం

Isha Foundation : సద్గురుకి సుప్రీం బిగ్ రిలీఫ్‌, మద్రాసు హైకోర్టులో ఇషా ఫౌండేషన్‌పై కేసు కొట్టివేత

Pm Modi : నాలుగు నెలల్లో ఇది రెండోసారి… మళ్లీ రష్యాకు ప్రధాని మోదీ, స్వయంగా ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్

Big Stories

×