Telangana Congress News(Latest breaking news in telugu):
తెలంగాణ సీఎం అభ్యర్థిపై తన అభిప్రాయాన్ని హైకమాండ్కు చెప్పానని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేసులో నలుగురు, ఐదుగురు ఉండటం తప్పుకాదన్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పక్కా ప్రొసీజర్ ఫాలో అవుతోందని చెప్పారు.
సీఎం అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయింస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉన్నారు.