తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు హస్తినలో మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే నివాసానికి కాంగ్రెస్ అగ్రనతే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వెళ్లారు. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక, మంత్రి పదవులపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనేతల భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ రేగుతోంది. ఎవరికి ఏ పదవులు కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డినే సీఎంగా ఖరారు చేసే అవకాశముందని సమాచారం. ఈ నిర్ణయం వెల్లడించిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందనే క్లారిటీ రానుంది.