Jagityal: ఐచర్ వాహనం ఇంట్లోకి దూసుకెళ్ళిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వరి ధాన్యం లోడ్ తో అల్లూరి సీతారామరాజు తండా నుంచి వెళ్తున్న వాహనం వెల్లుల్ల గ్రామ శివారులో అదుపు తప్పి మూల మలుపు వద్ద నేరుగా బబ్బిలి సాయమ్మ అనే మహిళ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బెడ్ రూమ్ లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంటి గోడ కూలిపోయి లోపల ఉన్న వస్తువులు చెల్లచెదురగా పడ్డాయి.
మూల మలుపుల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అన్నారు. వెల్లుల్ల గ్రామంలో రోడ్డు కోతకు గురైందంటున్నారు. ప్రయాణం ప్రమాదకరంగా మారిందంటున్నారు. రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.