E-Paper
Advertisement

Harish Rao : సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?

Harish Rao : సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?
Advertisement

గోదావరి నదీ జలాలపై బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై సీఎం రేవంత్ సైతం కేబినెట్ భేటీ అనంతరం స్పందించారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామని అందుకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తాజాగా సీఎం సవాల్‌కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని.. పొరుగు రాష్ట్రాలకు మేలు జరిగేలా, స్వరాష్ట్రానికి నష్టం వాటిల్లేలా రేవంత్ చర్యలు ఉన్నాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుందామని ప్రతిసవాల్ విసిరారు. కాగా, మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఆధారాలతో వస్తామన్న కాంగ్రెస్..

గోదావరి నదీ జలాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలు, ఆధారాలతో మరోసారి సభకు రానున్నట్టు తెలుస్తోంది.గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు అప్పుడు పొరుగు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలు, నీటి కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలకు సంబంధించిన ఆధారాలతో హాజరవ్వాలని చూస్తున్నట్టు తెలిసింది.గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అనుసరించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తున్నది.గతంలో ఆధారాలతో వెళ్లినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అడిగే ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంభించినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

నోటి మాటలేనా?

Advertisement

బీఆర్ఎస్ పార్టీ గతంలో పదేండ్లు అధికారంలో ఉన్నది. అప్పుడు కాళేశ్వరం పేరిట మహారాష్ట్రతో పలు ఒప్పందాలు చేసుకున్నది. అలాగే కృష్ణా నదీ జలాలు, గోదావరి మిగులు జలాల్లో ఏపీతోనూ పలు ఒప్పందాలు చేసుకున్నది. ఇందులో ఏపీకి అగ్రవాటా, తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాల కారణంగానే ఇప్పుడు ఏపీ.. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెబుతున్నదని మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ నాడు అలాంటి ఒప్పందాలు చేసుకోకపోతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని అంటున్నారు. కాగా, బీఆర్ఎస్ మాత్రం తాము అలా చేయలేదని… కేవలం నోటి మాటలు చెబుతున్నది. కానీ, ఆధారాలు మాత్రం చూపడం లేదు. అధికార పార్టీకి ఆధారాలు చూపిస్తే వారెందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Donald Trump: భారత్‌ను ఆపకపోయుంటే.. పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

సభలో ఉంటారా? వెళ్తారా?

Advertisement

గత అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాలపై చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు తనను బాడీ షేమింగ్ చేశారని సభ నుంచి వాకౌట్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దీనికి తోడు సెషన్స్‌ను సైతం ఆయన బాయ్ కాట్ చేశారు. మొత్తం సెషన్స్ ను బాయ్ కాట్ చేయడం వలన ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తలేదని.. విలువైన సభా సమయాన్ని గాలికి వదిలేశారని సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే,ఈసారి మరోసారి గోదావరి నదీ జలాలపై సీఎం చర్చకు ఆహ్వానించారు. అందుకు హరీశ్ రావు సిద్ధమంటూ జవాబిచ్చారు. మరి ఈసారైనా సభలో అర్థవంతమైన చర్చ జరుపుతారా? ఈసారి కూడా తమను అది, ఇది అన్నారని.. సభ నుంచి వెళ్లిపోతారా? అంటూ సోషల్ మీడియాలో పలువురు చర్చకు తెరలేపారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×