Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆడపిల్లను ఎలా పెంచాలి.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి అనే మెసేజ్ తో అనిల్ రావిపూడి ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ఆ డైలాగ్స్ బాలయ్య చెప్పడంతో మరింత రీచ్ వచ్చింది.
ఇక ఈ సినిమా మంచి విజయంతో పాటు.. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్యనే సైమా అవార్డ్స్ 2024 లో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి నిలిచిన విషయం తెల్సిందే. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా నిర్మాత సాహు గారపాటి ఈ అవార్డును అందుకున్న విషయం విదితమే.
ఇక తాజాగా ఈ సినిమా మరో అవార్డును అందుకోవడానికి సిద్దమయ్యింది. ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుగా గుర్తింపు తెచ్చుకుంది ఐఫా. ప్రతి ఏడాది ఇండస్ట్రీలో వచ్చిన ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ ను అందజేస్తుంది. ఇక ఐఫా 2024 మొదలయ్యింది. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు ఈ వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ కు సంబంధించిన తారలు దుబాయ్ కు చేరుకున్నారు.
టాలీవుడ్ తరపున రానా, కుర్ర హీరో తేజ సజ్జా హోస్ట్స్ గా వ్యవహరించనున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐఫాలో కూడా భగవంత్ కేసరి తన సత్తా చాటిందని తెలుస్తోంది. ఉత్తమ చిత్రంగా ఐఫా 2024 లో భగవంత్ కేసరి ఎంపిక అయ్యినట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది దుబాయ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయం తెలియడంతో బాలయ్య ఫ్యాన్స్.. బాలయ్యా.. మజాకానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అఖండ 2 ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.