EPAPER

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT Student Commits Suicide: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. కర్నూల్ నగర పరిధిలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ(డీఎం)లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. వేసవి సెలవుల తరువాత ఈ నెల 22 నుంచి ఆ విద్యార్థి తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి విద్యార్థి మృతదేహాన్ని తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ యాజమాన్య సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.


Related News

Visakha Agency: విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు.. పొంగిన వాగులు వంకలు.. గర్బిణీని ట్రాక్టర్‌పై…

Hilly areas under threat: విశాఖటప్నంలో వయనాడ్ పరిస్థితి.. కూలిపోయే స్థితిలో ఇళ్లు!

Prakasam barrage report: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటన, సీఎం చేతికి రిపోర్టు.. నెక్ట్స్ ఏంటి? వైసీపీ రియాక్ట్

Uttarandhra heavy rains: ఉత్తరాంధ్రలో వర్షాలు, పొంగుతున్న కాలువలు.. పోలీసుల వార్నింగ్

Anitha: జగన్.. ఇంతకు నువ్వు ఒక్క పులిహోర ప్యాకెటైనా పంపిణీ చేశావా..?: అనిత

RTC Bus: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు

Duvvada Vani Vs Madhuri: నా భర్తతో విడిపోతా.. శ్రీను నేను కలిసి ఈ ఇంట్లోనే.. మాధురి షాకింగ్ కామెంట్స్

Big Stories

×